సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్ అయ్యాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ 52, దూబె 39* పరుగులతో రాణించారు. ధోనీ 5*, ఓపెనర్ రహానె 9 పరుగులు చేశారు. భువనేశ్వర్, ఉనద్కట్, నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు.