మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి వేడుకలు గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పూలే స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన సమాజం కోసం అనునిత్యం శ్రమించారన్నారు.