పౌరాణిక, జానపద నృత్యం.. పూనకం వచ్చి ఊగిపోయిన అమ్మాయిలు (వీడియో)

67చూసినవారు
తమిళనాడులోని మధురై తముక్కం మైదానంలో నిర్వహించిన బుక్ ఫెయిర్‌లో శనివారం ఆశ్చర్యకర ఘటన జరిగింది. బుక్ ఫెయిర్‌లో కొందరు కళాకారులు పౌరాణిక, జానపద నృత్యాలు చేశారు. ఆ సమయంలో కొందరు స్కూల్ అమ్మాయిలు విచిత్రంగా ప్రవర్తించారు. వారు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఎవరూ వారిని కంట్రోల్ చేయలేకపోయారు. చివరికి స్పృహ తప్పి కింద పడ్డారు. సపర్యలు చేయగా లేచి కూర్చున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్