పెళ్లి కోసం యువతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

512చూసినవారు
పెళ్లి కాని యువతుల కోసం రక్షాపురం శివాలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. వివాహం జరగాలని 18 సంవత్సరాలు పైబడిన యువతులతో ఈ వ్రత కార్యక్రమం కొనసాగింది. ఆలయ కమిటీ ఈవో శ్రీనివాస్, ప్రధాన అర్చకులు నేతి మాధవ శర్మ, ఆలయ ఇన్ ఛార్జ్ పార్థసారధిల పర్యవేక్షణలో ఈ పూజ మహోత్సవం కొనసాగింది. స్థానిక పరిసరాలకు చెందిన వివాహం జరగని యువతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ట్యాగ్స్ :