హైదరబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. ఆరు రాష్ట్రాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్ లు బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేయడానికి శుక్రవారం జీహెచ్ఎంసీని సందర్శించారు. ముస్సోరిలో ట్రైనింగ్ పొందుతున్న హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, యూపీ ట్రైనీ ఐఏఎస్ లు ఉన్నారు.