సైబరాబాద్ కమిషనరెట్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు గురువారం ముమ్మరంగా దాడులు చేశారు. బాలానగర్, పేట్ బషీరాబాద్, బాచుపల్లి ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో అక్రమ మద్యం రావాణాగా గుర్తించారు. పట్టుబడిన వారి నుంచి రూ. 1. 24 లక్షల నగదు, రూ 32 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.