బీజేపీ నేత, 8సార్లు ఎంపీగా గెలిచిన మేనకా సంజయ్ గాంధీ ఆస్తులు ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆమె యూపీలోని తన సిట్టింగ్ స్థానమైన సుల్తాన్పూర్ లోక్సభ స్థానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.97.17 కోట్లుగా ప్రకటించారు. అఫిడవిట్ ప్రకారం, 2019లో ఆమె మొత్తం ఆస్తి విలువ రూ.55.69 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 43 శాతం పెరిగి రూ.97.17 కోట్లకు చేరుకుంది.