మేడ్చల్ లో గుడిలోని విగ్రహాలు ధ్వంసం

2936చూసినవారు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పురా గ్రామంలో గుడిలోని విగ్రహాలను గుర్తు తెలియని ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ధ్వంసం అయిన విగ్రహాల ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదయింది. విగ్రహాలు ధ్వంస అయిన విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్