లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్

80చూసినవారు
మల్లేపల్లి డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ జాఫర్ ఖాన్ జలమండలి సిబ్బందితో కలిసి బుధవారం పర్యటించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్లు, వాటర్ లైన్ సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలుపగా వెంటనే అధికారులకు, సిబ్బందికి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్