బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

84చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మందుకు బానిసైన ఓయువకుడు ఈజీ మనీ కోసం వైన్ షాపుల ముందు నిలిపిఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న దొంగను జగద్గిరిగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. ఆనంద రెడ్డి అనే వ్యక్తి ద్విచక్రవాహనాలను టార్గెట్ చేసి మారు తాళాలు ఉపయోగించి దొంగలించే వాడు, అతని దగ్గర నుండి22ద్వి చక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారని బాల నగర్ ఎసిపి హనుమంత రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్