రాంనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆందోళన

575చూసినవారు
ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. రోడ్డుపై శనివారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత ముఠా జై సింహా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్