గాంధీలో మాజీ డిసిపి రాధాకిషన్ రావుకు వైద్య పరీక్షలు

72చూసినవారు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్ బందోబస్తుతో ఆయణ్ని గాంధీకి తీసుకువచ్చిన నేపథ్యంలో మీడియాను లోనికి అనుమతించలేదు. వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి పోలీసుల బందోబస్తుతో మేజిస్ట్రేట్ ముందు హజరు పరిచేందుకు తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్