సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హత్య

63చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హత్య
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి (45) హత్యకు గురయ్యాడు. శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో 10వ ప్లాట్ ఫారం వీఐపి గేట్ సమీపంలో మృతదేహం ఉన్నదన్న సమాచారంతో వెళ్లి చూడడం జరిగిందని ఇన్ స్పెక్టర్ సాయీశ్వర్ గౌడ్ తెలిపారు. మృతుడు హత్యకు గురైనట్లు గుర్తించి వెంటనే క్లూస్ టీమ్, జాగిలాలను తెప్పించి ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్