షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

85చూసినవారు
షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ పాఠశాలలో షీ టీమ్ ఇంచార్జ్ నర్సింలు ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, డయల్ 100, షీ టీం నెంబర్ 181 తదితర అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, సి డబ్ల్యూ సి కోఆర్డినేటర్ రాజు, షీ టీం సభ్యులు మనీషా, శోభ రాణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్