హైదరాబాద్ లో మెట్రో సేవల్ని విస్తరించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలుని పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపితే.. కేంద్రం నుంచి తాను అనుమతులు తీసుకొస్తానని చెప్పారు. రఘునందన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.