గణేష్ నిమజ్జనం.. ఇసుకేస్తే రాలనంత జనం

58చూసినవారు
గణేష్ నిమజ్జనం.. ఇసుకేస్తే రాలనంత జనం
గణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు వచ్చారు. నిమజ్జనానికి వచ్చే గణనాథులతో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్‌ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. నిమజ్జనాలు, ట్రాఫిక్‌ ఆంక్షలు, దారి మళ్లింపుతో రద్దీ ఏర్పడింది. 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోంది. పోలీసుల పర్యవేక్షణ లేక వాహనాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంజే మార్కెట్‌ నుంచి ఖైరతాబాద్‌ వరకు భారీగా వాహనాలు నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్