అయోధ్యకు సంబంధించి ముఖ్యమైన అంశాలు

1584చూసినవారు
అయోధ్యకు సంబంధించి ముఖ్యమైన అంశాలు
అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ ను 2019 మర్చి 8వ తేదీన ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 9న అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును విలువరించింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్ లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రం, యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 ఫిబ్రవరి 5వ తేదీన అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 మందితో ట్రస్టు ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.