చిన్నతనంలోనే తల్లిదండ్రలను కోల్పోయిన గోపాలకృష్ణయ్య

62చూసినవారు
చిన్నతనంలోనే తల్లిదండ్రలను కోల్పోయిన గోపాలకృష్ణయ్య
కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. మూడవ రోజునే తల్లిని, మూడవ ఏటనే తండ్రిని కోల్పోయిన గోపాలకృష్ణయ్య పినతండ్రి, నాయనమ్మ సంరక్షణలో పెరిగారు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడం చేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్లలో చదివి ఉత్తీర్ణుడయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్