2023లో దేశంలోనే అత్యధికంగా ఏపీలో 78% మంది ఇంటర్ విద్యార్థులు సైన్స్ విభాగంలో చేరిక: స్టడీ

15217చూసినవారు
2023లో దేశంలోనే అత్యధికంగా ఏపీలో 78% మంది ఇంటర్ విద్యార్థులు సైన్స్ విభాగంలో చేరిక: స్టడీ
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులు దాదాపు 80% మంది సైన్స్ గ్రూపులను ఎంచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ అధ్యయనం తెలిపింది. 2023లో రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా ఏపీలో 78% మంది ఇంటర్ విద్యార్థులు సైన్స్ విభాగాన్ని ఎంచుకోవడంతో ఆ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ 70 శాతానికి మించి సైన్స్ స్ట్రీమ్ లో చేరలేదు. ఈ జాబితాలో 68.4%తో మణిపుర్ రెండో స్థానంలో, 65.1%తో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్