ఆ ఆలయంలో హనుమంతుడిని బేడీలతో బంధించారు.. ఎక్కడంటే?

78చూసినవారు
ఆ ఆలయంలో హనుమంతుడిని బేడీలతో బంధించారు.. ఎక్కడంటే?
ఒడిస్సాలో పూరీలో దారియా మహావీర క్షేత్రంగా పిలిచే హనుమాన్ దేవాలయం ఉంది. అయితే ఈ ఆలయంలో హనుమంతున్ని సంకేళ్లతో బంధించి ఉంచుతారు. పూరీ ప్రజలను సముద్రుడి నుంచి రక్షించేందుకు హనుమంతుడిని కాపలాదారుడిగా నియమించారు. అయితే ఓసారి హనుమంతుడు జగన్నాథుని అనుమతి లేకుండా అయోధ్య వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన జగన్నాథుడు హనుమంతుడిని అక్కడి నుంచి ఎక్కడికి కదలకుండా కాళ్లు చేతులను తాడుతో కట్టేశారని స్థల పురాణం చెబుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్