ఫలితాల్లో మళ్లీ బాలికలదే హవా

582చూసినవారు
ఫలితాల్లో మళ్లీ బాలికలదే హవా
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. 2023-24 విద్యా సంవత్సరంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 91.31శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలురలో 89.42శాతం, బాలికల్లో 93.23శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత బాలురకంటే 3.81శాతం అధికంగా ఉంది.