సినీ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రియా శ్రీనాథ్కు టికెట్ నిరాకరించింది. 2019లో ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ నుంచి సుప్రియా శ్రీనాథ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే.