మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ శంకర్రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కూడా కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది.