గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2020 నోటిఫికేషన్ ద్వారా రెండో విడతలో ఎంపికైన ఉద్యోగులకు ప్రొబేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వీరికి అర్హత పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఇందులో పాసైనవారికి ప్రొబేషన్ ఇచ్చింది. ఇక వీరికి పెంచిన జీతం మే నుంచి వర్తిస్తుందని తెలిపింది. కాగా, మెుదటి విడతలో అర్హత సాధించిన వారికి ఇప్పటికే ప్రొబేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.