మారుమూల గ్రామాల్లోనూ UPI సేవలు పెరిగినప్పటికీ నగదు వినియోగం ఏ మాత్రం తగ్గలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణీ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లకు చేరింది. నగదు విత్ డ్రా కూడా పెరిగినట్లు సీఎంఎస్ సంస్థ వెలువరించిన కన్జంప్షన్ రిపోర్ట్ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.1.35 కోట్లుగా ఉన్న ఈ మొత్తం రూ.1.43 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.