సంక్షోభం కారణంగా తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, హింసాయుత ఘటనలు, సైన్యం అణచివేత చర్యలు తట్టుకోలేక పాకిస్తాన్ నుంచి అమృత్ సర్ వైపు ఇతర మార్గాల గుండా కూడా మన దేశంలోకి శరణార్థులుగా ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి భారత్కు ఎంతో మంది శరణార్థులుగా తరలివచ్చారు. ఇలా వచ్చే శరణార్థులు తాకిడిని తట్టుకోగల స్థితి భారత్కు లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.