కోస్ట్గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను చైనా గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్ వాదిస్తోంది.