దేవాలయాల్లో తనిఖీలు

53చూసినవారు
దేవాలయాల్లో తనిఖీలు
సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అధికారులు నిన్న తనిఖీలు నిర్వహించి 945 కిలోల నెయ్యిని సీజ్‌ చేశారు. ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి ఈ నెయ్యి సరఫరా అయినట్లు అధికారులు వెల్లడించారు. అన్నవరం దేవస్థానంలో పంచదార బస్తాకు చీమలు పట్టడాన్ని గుర్తించారు. మరో బస్తాలో ఉన్న బన్సీ రవ్వకు బూజుపట్టి, పురుగులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రసాదం తయారీ విధానం, వినియోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులను చూసి.. వాటి నమూనాలను తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్