ఐపీఎల్లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికంగా ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఈఎస్ఏ డేగా సెలబ్రేట్ చేసుకోనుంది. ఇందులో భాగంగా ముంబైలోని ఎన్జీఓల నుంచి 20 వేల మంది పిల్లలకు ఫ్రీగా మ్యాచ్ను చూసే అవకాశం కల్పించనుంది. కాగా 2010 నుంచి ప్రతి సీజన్లో ముంబైలో జరిగే ఓ మ్యాచ్ను ఈఎస్ఏ(అందరికీ విద్య, క్రీడలు) డేగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.