సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఎడమ మడమ గాయానికి గురైన హసరంగ కాస్త ఆలస్యమైనా తమ జట్టుతో చేరతాడని SRH భావించింది. కానీ తమ ప్రధాన ప్లేయర్ హసరంగ ఐపీఎల్లో ఆడటం కుదరదని బీసీసీఐకి లంక క్రికెట్ బోర్డు వెల్లడించిదని తాజా సమాచారం. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ను దృష్టిపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.