TG: తొలి రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ ఇవాళ గైర్హాజరయ్యారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించారు. ‘కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించగా, ‘మీ సీఎం కంటే దూరంగా లేరు. వ్యక్తిగత విమర్శలు మానాలి’ అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బదులిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.