దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాగ్వార్ లాండ్ రోవర్ లగ్జరీ కార్లను భారత్లోనే తయారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం తమిళనాడులో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిటన్, చైనా, బ్రెజిల్, స్లొవాకియాలో JLR ప్లాంట్లు ఉన్నాయి.