జనసేన గుర్తు.. ఫ్రీ సింబల్‌గా మారిన వైనం

64చూసినవారు
జనసేన గుర్తు.. ఫ్రీ సింబల్‌గా మారిన వైనం
జనసేన గుర్తు గాజు గ్లాసు.. ఇప్పుడు ఫ్రీ సింబల్‌గా మారింది. అంటే జనసేన పోటీ చేస్తున్న స్థానాలను మినహాయిస్తే ఏపీలోని మిగిలిన స్థానాల్లో అదే సింబల్‌ మీద ఇండిపెండెంట్లు కూడా పోటీ చెయ్యొచ్చు. జనసేన పోటీలో లేని స్థానాల్లో TDP, జనసేన రెబల్స్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది EC. దీనివల్ల కూటమి ఓట్లు చీలిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆయా పార్టీల వర్గాలు.