ప్రముఖ టెలికాం సంస్థ
జియో.. ఎయిర్ ఫైబర్ (Air fiber) యూజర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 60 రోజుల పాటు ట్రిపుల్ ఇంటర్నెట్ స్పీడ్ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అంటే ప్రస్తుత ప్లాన్ కంటే మూడింతల అధిక వేగంతో డేటాను అందివ్వనుంది. కొత్త యూజర్లతో పాటు ఇప్పటికే ఎయిర్ఫైబర్ వినియోగిస్తున్న వారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. త్వరలో ఐపీఎల్ సీజన్ ఫీవర్ ప్రారంభం కాబోతున్న వేళ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం.