అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వంటి సంస్థాగత మదుపర్లకు షేర్లను విక్రయించడం ద్వారా JSW ఎనర్జీ రూ.5,000 కోట్లు సమీకరించింది. వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేయడం కోసం ఈ నిధులను సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. జీక్యూజీ, బ్లాక్ రాక్, నొమురా తదితర సంస్థలు ఈ క్యూఐపీ ఇష్యూలో పాల్గొన్నాయి.