మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

81చూసినవారు
మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. మద్యం కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రమేయం ఉందని ఈడీ హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం 17 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.