మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం నిజామాబాదులోని ఆయన భౌతిక కాయానికి సికింద్రాబాద్ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన డిఎస్ లేకపోవడం పార్టీకి తీరని లోటన్నారు.