ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్

71చూసినవారు
ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు మద్దతుగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ శనివారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తుందన్నారు.