ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

68చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సి. వి. రామన్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల సైన్స్ అధ్యాపకులు సి. వి రామన్ గొప్పతనాన్ని ఆయన జీవిత విశేషాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ మాట్లాడుతూ.. సైన్స్ రోజువారీ జీవితం లో అంతర్భాగమని, జిజ్ఞాస తెలుసుకోవాలని కుతూహలం ఉన్నప్పుడే పరిశోధనలు చేస్తారని రాబోయే రోజులలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్