భక్తులతో కిటకిటలాడిన శ్రీ నీలకంటేశ్వరాలయం

60చూసినవారు
ఎల్లారెడ్డిలోని అతి పురాతన నీలకంటేశ్వరాలయంలో రెండవ శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన వీరశైవ లింగాయత్ ప్రతినిధి ముత్తి వీరప్ప, ముత్తి రామప్ప సోదరులు కలిసి శివునికి అన్న పూజ నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ. మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయిబాబా, బీఆర్ఎస్ నేత సతీష్, పలువురు నేతలు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you