ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ నాయకత్వంలో శుక్రవారం ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో ఎల్లారెడ్డి పట్టణ గౌడ సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో కృష్ణగౌడ్, ఎన్. శ్రీనివాస్ గౌడ్, బాలకిషన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవిగౌడ్, సిద్ధిరామగౌడ్, సతీష్ గౌడ్, కృష్ణగౌడ్, సాయిరాంగౌడ్, కిషన్ గౌడ్ వున్నారు. ఎమ్మెల్యే మదన్మోహన్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.