గంగాధర కూడలిలోని బస్టాండ్ దారి గుంతలమయమై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. గురువారం ప్రయాణ ప్రాంగణంలో వెళ్లే క్రమంలో రెండు బస్సులు ఎదురెదురయ్యాయి. గుంతలో బస్సు దిగబడి పక్కనుంచే వెళ్తున్న బస్సుపై ఒరిగింది. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గుంతల్లో బండరాళ్లు వేసి బస్సులను బయటకు తీయగ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అరగంట పాటు బస్టాండులోకి రాకపోకలు నిలిచిపోయాయి.