రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

1048చూసినవారు
రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
విశాఖలో కొకైన్ కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25 వేల కిలోల డ్రై ఈస్ట్ కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్‌ నుంచి భారీ పరిమాణంలో కొకైన్ విశాఖకు తరలిస్తున్నట్లు ఇంటర్‌పోల్ సీబీఐ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అధికారులు రైడ్ చేసి కంటెయినర్ స్వాధీనం చేసుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కొకైన్ ధర మార్కెట్‌లో రూ. 50 వేల కోట్లు ఉంటుందని సమాచారం. విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్