కారు బస్సు ఢీ.. నలుగురికి స్వల్ప గాయాలు

45728చూసినవారు
కారు బస్సు ఢీ.. నలుగురికి స్వల్ప గాయాలు
హుజురాబాద్ మండలం సింగాపురం శివార్లో ఎదురెదురుగా వస్తున్న బస్సు, కారు ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే గోదావరిఖనికి చెందిన గడ్డం తిరుపతి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలసి ఐలోని మల్లన్న దర్శనానికి గోదావరిఖని నుండి బయలుదేరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. వరంగల్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొనగా కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్