గోదావరి తీరాన వెలసిన వేలాల గట్టు మల్లన్న స్వామిని శుక్రవారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేలాది భక్తులు గుట్టపై విడిది గుడారాలు ఏర్పాటు చేసుకుని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, జాతర కమిటీ, ఎండోమెంట్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సిపి పేర్కొన్నారు.