వంశీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్ది గడ్డం వంశీ కృష్ణను భారీ మెజారిటీతో గెల్పించాలని నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం 6వ డివిజన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్ ఇన్ ఛార్జ్ బోయిని సన్ని, డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, శీలం సదానందం, కిన్నెర లక్ష్మీపతి, సలిగంటి ఓదెలు, మైనార్టీ సెల్ ఖదీర్ పాషా, సాల్మన్ రాజు పాల్గొన్నారు.