కూలీ హత్య..!? ఘటన స్థలానికి పోలీసులు

32439చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంత నగర్ లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసారు. మృతునిది ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని ఏండ్లుగా వేములవాడలో కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతున్న మహేశ్ రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన తరుణంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకొని పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్