వేములవాడ: రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

85చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని విజయదశమి పర్వదినం శనివారం నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్