బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ టీవీ-9 లైవ్షో బిగ్ డిబేట్లో పాల్గొనబోతున్నారు. పుష్కర కాలం తరువాత లైవ్ షోలో కేసీఆర్ పాల్గొంటున్నారు. 12 ఏళ్ళ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వబోతుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేపటి నుంచి చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో బిగ్ డిబేట్కు ప్రాధాన్యం ఏర్పడింది. కేటీఆర్ కూడా కొద్ది రోజుల క్రితం ఇదే ఛానల్ లో డిబెట్ లో పాల్గొన్నారు.