సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఈ పిటిషన్ సమర్పించారు. సతీష్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని, అందుకే ఏడు రోజులు కస్టడీ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీష్ తరఫు న్యాయవాదిని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు.